ఆదిలాబాద్ : ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపుతప్పి బోల్తాపడింది(Overturned). ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు(Injured ). ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad) జిల్లాలోని తలమడుగు మండలం చర్లపల్లి(Charlapalli) శివారులో సోమవారం చోటు చేసుకుంది. ఝరిపూన గూడ నుంచి చర్లపల్లి వెళ్తుండగా చర్లపల్లి మూలమలుపు వద్ద అదుపుతప్పి బస్సు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్తో పాటు నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.