Bhainsa | భైంసా, సెప్టెంబర్ 22: నిర్మల్ జిల్లా భైంసాలో మతసామరస్యం వెల్లివిరిసింది. నవరాత్రోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల విద్యుత్తు బిల్లును ఎంఐఎం నేత, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ శుక్రవారం 35 మండపాల రుసుం రూ.54,600 చెల్లించినట్టు విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
విద్యుత్తు బిల్లులు చెల్లించిన ఎంఐఎం నేతకు పలువురు అభినందనలు తెలిపారు.