Manda Krishna | హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి మాదిగలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ ఎమ్మార్సీస్ అధినేత మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ నారాయణ శ్రీ గణేశ్కు కేటాయించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళ మూలాలు ఉన్నటువంటి అరవమాల సామాజిక వర్గానికి చెందిన శ్రీ గణేశ్కు టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. మొన్న ఎంపీ టికెట్లలో మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా, కంటోన్మెంట్ టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా తమిళ మూలాలు ఉన్నటువంటి అరవ మాల సామాజిక వర్గానికి కేటాయించడాన్ని తప్పుబట్టారు మందకృష్ణ మాదిగ.