తిరుమల, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తిరుమల వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మలయప్ప స్వామి మోహినీరూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు.
పకనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.