కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ)/ఉట్నూర్: సీజనల్ వ్యాధులపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండటంతో వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించింది. మలేరియాను నివారించేందుకు రాష్ట్రంలోని 5 ఐటీడీఏల పరిధిలో 4,84,309 దోమ తెరల పంపిణీ, దోమల మందు పిచికారీ చేస్తున్నది. సర్కార్ చర్యలతో రాష్ట్రంలో మలేరియా కేసులు భారీగా తగ్గాయి.