హాలియా, సెప్టెంబర్ 5 : నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్కు మాల మహానాడు సంపూర్ణ మద్దతు తెలిపింది. నల్లగొండ జిల్లా హాలియాలో మంగళవారం జరిగిన మాల మహానాడు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ సత్యం, నాయకుడు కే జానయ్య మాట్లాడుతూ దేశంలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళితుబంధు గొప్ప పథకమని కొనియాడారు. బీఆర్ఎస్ అభ్యర్థి భగత్ను గెలిపించేందుకు మాలలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.