హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాల నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఖమ్మం పరిధిలో 5లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మూడు రాష్ట్రాల నుంచి సీఎంలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
పంజాబ్, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులకు సభ కోసం ఆహ్వానాలను పంపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని నేతలకు కేసీఆర్ సూచించారు. జిల్లా నేతలందరూ వ్యక్తిగత విభేదాలు వీడి కలిసి పనిచేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. భేటీలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు హరిప్రియ, సండ్ర, రాములు నాయక్, ఎమ్మెల్సీ మధు, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.