నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కవితకు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఒక గొప్ప వక్త, అన్ని రంగాలలో మంచి విషయ పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై ఎనలేని పోరాట స్వభావం ఉన్న నాయకురాలు కవిత అని కొనియాడారు.
స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా కవిత ఎన్నికవడంతో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు భరోసా వచ్చినట్లయిందన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాకి ఎంతో మేలు చేకూరుతుందన్నారు.