హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపు, మౌలిక వసతుల మెరుగుదలకు సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలు చారిత్రాత్మకమని టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల అభిప్రాయపడ్డారు. ‘మన ఊరు-మన బడి’ ప్రణాళిక సహా ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయమని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయాలతో పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాలకు విద్య మరింత చేరువవుతుందని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో చదివేవారికి ఉన్నత విద్యలో ఎలాంటి ఇబ్బందులుండవని, జీవితంలో రాణించగలుగుతారని అన్నారు.