హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): సీఈఐఆర్ విధానంతో 95 రోజుల్లో 4,173 ఫోన్లను వాస్తవ వినియోగదారులకు అప్పగించినట్టు సీఐడీ విభాగం ఏడీజీ, సీఈఐఆర్ సూపర్ యూజర్ మహేశ్ భగవత్ సోమవారం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 47,862 ఫోన్లు బ్లాక్ చేయగా.. 6,644 (20 %) ఫోన్లను ట్రేస్ చేశారు.
4,147 (42 %) ఫోన్లను వినియోగదారులకు అప్పగించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉందని సీఐడీ చీఫ్ వెల్లడించారు.