చేర్యాల;మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో బుధవారం తెల్లవారుజామున పెద్దపట్నం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి ఆధ్వర్యంలో ఒగ్గు పూజారులు భక్తిశ్రద్ధలతో కుంకుమ, పసుపు, బియ్యం పిండి, తంగెడు పిండి, గులాల్తో పట్నం వేశారు. అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పెద్దపట్నం దాటగానే.. భక్తులు కూడా పట్నం దాటి స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకొన్నారు.