హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం నిర్మించడం, కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గొప్ప విషయమని ఉత్సవ కమిటీ వరింగ్ చైర్మన్ మేడి పాపయ్య మాదిగ కొనియాడారు. బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా ఊరూరా ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేయాలని పిలుపునిచ్చారు.
ట్యాంక్బండ్ తీరంలో ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్న 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో దళిత గిరిజన సంఘాలు, పౌరసంఘాలు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహాన్ని సందర్శించిన వారిలో ఉత్సవ కమిటీ వరింగ్ చైర్మన్ శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ జేరిపోతుల పరశురామ్, నాగారం బాబు, బంగారి శ్రీను, రంజిత్, నర్ర ప్రవీణ్ తదితరులు ఉన్నారు.