హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): పీజీ కోర్సుల్లో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ ఈ ఏడాది కింగ్లా మారింది. ఈ సంవత్సరం పీజీ ప్రవేశాల్లో అత్యధిక అడ్మిషన్లు ఈ కోర్సులోనే నమోదయ్యాయి. ఇదివరకు ఎం కాం జనరల్, ఎమ్మెస్సీ గణితం వంటి కోర్సుల ఆధిపత్యం సాగగా, ఈ ఏడాది పరిస్థితి మారింది. ఈ ఏడాది కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీ గెట్) సీట్ల భర్తీ వివరాలను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడైంది. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కోర్సుల్లోనూ సీఎస్ఈ వంటి కంప్యూటర్ సైన్స్ కోర్సుల ఆధిపత్యం కొనసాగుతుండగా, తాజాగా పీజీ కోర్సుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
ఆర్ట్స్ తగ్గుముఖం.. సైన్స్కు డిమాండ్
గత మూడేండ్లుగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. 2020లో 26,572 మంది విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరితే 2021కి వచ్చేసరికి 25,588కి తగ్గింది. ఇక ఈ ఏడాది 23,138కి పడిపోయింది. ఈ మూడేండ్ల వ్యవధిలో 3 వేలు తక్కువగా అడ్మిషన్లు నమోదయ్యాయి. మొత్తంగా కామర్స్, ఆర్ట్స్ వంటి కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతుండగా, సైన్స్ కోర్సుల్లో ప్రవేశాల సంఖ్య పెరుగుతున్నది.
ఈ సంవత్సరం ప్రవేశాల్లో ప్రత్యేకతలు