అపస్మారక స్థితిలో ఉన్న బాలికపై అత్యాచారం
పరిగి, మార్చి 30: వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలికను హత్య చేసింది ఆమె ప్రియుడేనని తేలింది. బుధవారం పరిగి పోలీస్స్టేషన్లో వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. అంగడిచిట్టెంపల్లికి చెందిన కావలి మహేందర్(20)కు ఓ బాలికకు మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నది. ఈ విషయమై తల్లి తన కూతురిని మందలించింది. ఈనెల 28న తెల్లవారుజామున మహేందర్, సదరు బాలిక గ్రామ శివారులో కూర్చొని మాట్లాడుకొన్నారు. సన్నిహితంగా ఉందామని మహేందర్ ఒత్తిడి చేయగా ఆమె అంగీకరించలేదు. ఈ క్రమంలో మహేందర్ ఆమె తలను బలంగా చెట్టుకు కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయినప్పటికీ మహేందర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో మృతిచెందింది. మహేందర్ను బుధవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు.