యాదాద్రి, ఆగస్టు 20: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రతిమతో తయారు చేసిన బంగారు లాకెట్లను భక్తులు కొనుగోలు చేసే అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పించారు. సుమారు 3 గ్రాములతో ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు లాకెట్ను రూ.17,500 చెల్లించి భక్తులు పొందవచ్చు. ఓవైపు లక్ష్మీసమేతుడైన స్వామివారు, మరోవైపు నృసింహ యంత్రం తో బంగారు లాకెట్ను రూపొందించారు. ఈ లాకెట్ను మూలవరుల వద్ద పూజలు నిర్వహించి భక్తులకు అందజేస్తారు.