సిరిసిల్ల రూరల్, సె ప్టెంబర్ 10: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మం డెపల్లికి చెందిన లిం గం పరశురాములు (38) దుబాయ్లో మృతి చెందాడు. మృతదేహాన్ని తెప్పిం చాలని కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ను కోరగా.. వెంటనే స్పందిం చారు.
దుబాయ్ ఎంబీసీ అధికారులతో మాట్లాడారు. త్వరగా మృతదేహం వచ్చే లా చూడాలని కోరారు. మృతుడి వివరాలను దుబాయ్ ఎంబీసీ అధికారులకు పంపించినట్టు మంత్రి పేషీ తెలిసింది. కాగా.. పరశురాములు కొద్దిరోజుల క్రితమే స్వగ్రామం వచ్చి.. గత జూలై 9న మళ్లీ దుబాయ్ వెళ్లాడు. రోజులాగే ఈ నెల 9న పనిలోకి వెళ్లాడు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అనూష, కూతురు జశ్విత(3), తల్లిదండ్రులు ఉన్నారు.