మైహోం గ్రూపు చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావుకు గురువారం గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానంచేశారు. 35 ఏండ్లుగా నిర్మాణ రంగంలో అందించిన విశిష్ట సేవలకు క్రెడాయ్-తెలంగాణ ఈ అవార్డును ప్రకటించింది. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన టీఎస్ కాన్క్లేవ్లో అవార్డును ప్రదానంచేశారు. ఈ సందర్భంగా రామేశ్వర్రావు మాట్లాడుతూ.. నాణ్యమైన నిర్మాణాలతో, కచ్చితమైన సమయానికి డెలివరీ చేస్తే వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనవచ్చునని చెప్పారు. తాను గత మూడేండ్లుగా ముచ్చింతల్లో నెలకొల్పనున్న సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ప్రాజెక్టుపై ఎక్కువగా పనిచేస్తున్నానని, ఫిబ్రవరిలో నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ