హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లను ఇటీవల దారుణంగా తిట్టి, దాడికి పాల్పడిన ఘటనలో నిందితురాలైన అంబర్పేటకు చెందిన సయ్యద్ సమీనాను ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సమీనాను రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసు విచారణను త్వరగా చేపట్టి నిందితురాలిని అరెస్టుచేసిన పోలీసులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినా, దాడులకు పాల్పడినా యాజమాన్యం ఏ మాత్రం సహించబోదని సజ్జనార్ హెచ్చరించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని చెప్పారు.