యాదాద్రి, సెప్టెంబర్ 21 : ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్టలో బుధవారం స్వామి, అమ్మవార్లకు లక్షపుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. సహస్రనామ పఠనాలతో సుమారు రెండు గంటలపాటు కొనసాగించారు. స్వామివారికి నిత్యోత్సవాలను శాస్ర్తోక్తంగా జరిపారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు.
ఉదయం, సాయంత్రం సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొన్నారు. ఖజానాకు రూ. 8,94,176 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.