కవాడిగూడ ; ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్యాంక్బండ్పై కుమ్రం భీం విగ్రహం వద్ద కుమ్రంభీం మనవడు సోనేరావ్ నివాళులు అర్పించారు. ఆదివాసీలు, గిరిజనులు, నిరుపేదలకు న్యాయం చేకూరినప్పుడే కుమ్రంభీంకు నిజమైన నివాళి అని, పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆదిలాబాద్లో నెలకొల్పాలని, జీవోఎంఎస్ నెంబర్ 34 గిరిజన సాధికారిత విధానం-2010ను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఎస్టీ కమిషన్, ఐటీడీఏను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేయాలని విన్నవించారు. కుమ్రంభీంకు భారత రత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు.