KTR | కాంగ్రెస్ పాలనలో కంటోన్మెంట్లోని మిలిటరీ వాళ్ల స్థావరంలో కూడా దాడికి గురయింది. దుండగులు దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై తెలంగాణ భవన్లో ‘ఛార్జ్ షీట్’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మిలిటరీ వాళ్ల స్థావరంపైనే దాడి జరగడమంటే ఇంతకంటే హీనమైన ప్రభుత్వం, ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి లేదన్నారు.
ఆడబిడ్డలపై హత్యాచారాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ నేతల కొడుకులపై పోక్సో ఆరోపణలు వస్తే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నిందితులు సీఎం బంధువుల దవాఖానలోనే షెల్టర్ ఇప్పించారు. వారిని తొమ్మిది రోజుల పాటు కంటికి రెప్పలా సీఎం కాపాడారని ఆరోపించారు. విశ్వనగరమైన హైదరాబాద్లో ఇది శాంతి భద్రతల పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్లో మిలిటరీ వాళ్ల స్థావరంలో కూడా దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లారు
ఇంతకంటే హీనమైన ప్రభుత్వం, ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి లేదు
– కేటీఆర్ https://t.co/fP8dfWOBua pic.twitter.com/6P8zC49HzV
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026