హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గడపగడపకు భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ 14న కోటి భగవద్గీతోత్సవాన్ని త్రిదండి చినజీయర్ స్వామి నేతృత్వంలో నిర్వహించనున్నట్టు కృష్ణం వందే జగద్గురుమ్ ఫౌండేషన్ చైర్మన్ గోసుల శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బుధవారం చినజీయర్ను కలిసి విన్నవించగా.. అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రంగనాథ్ వేదాల, డాక్టర్ కృష్ణ, సందీప్ మంకు, రాజన్నయాదవ్, మనోజ్యాదవ్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.