హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : తిరుమల ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్నది. ఈ నెల 27న ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని అధికారులు స్పష్టం చేశారు.