వరంగల్ చౌరస్తా, మార్చి 1: ప్రీతి మృతికి మానసిక వేధింపులే కారణమని యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారించినట్టు కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాస్ తెలిపారు. బుధవారం కేఎంసీలో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ అధ్యక్షతన 13 మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశం మూడు గంటలపాటు కొనసాగింది. అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. సెల్ఫోన్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరిగిన సంభాషణను పరిశీలించిన కమిటీ సైఫ్ పీజీ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన పోస్టింగులు కీలకంగా మారాయని తెలిపారు.
వేధింపులపై బాధితురాలి తండ్రి ద్వారా అందిన సమాచా రం మేరకు అనస్థీషియా విభాగాధిపతి నాగార్జునరెడ్డి జరిపిన విచారణలో ప్రీతి తనను సైఫ్ వేధిస్తున్నట్టు, విధి నిర్వహణలో తనకు సీనియర్లు ఎవరూ సహకరించవద్దంటూ పోస్టింగులు పెట్టినట్టు రోదిస్తూ చెప్పిన విషయాన్ని విభాగాధిపతి వెల్లడించినట్టు తెలిపారు. మానసిక వేధింపులే ప్రీతి మరణానికి కారణమని విచారణలో కమిటీ నిర్ధారించినట్టు స్పష్టంచేశారు. ఈమేరకు కమిటీ నివేదికను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు, నేషనల్ మెడికల్ కమిషన్కు సమర్పించనున్నట్టు వెల్లడించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వాసుచంద్ర, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, ఫార్మకాలజీ అసోసి యేట్ ప్రొఫెసర్ దామోదరీబాయ్, కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్ రాజ్డేవిడ్, ఫోరెన్సిక్ అసోసి యేట్ ప్రొఫెసర్ రజామాలిక్ ఖాన్, లిం గమూర్తి, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసుపై సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బుధవారం కేఎంసీకి చేరుకున్న పౌరహక్కుల సంఘం ప్రతినిధులు నిజనిర్ధారణ కోసం కేఎంసీ, ఎం జీఎం సందర్శించారు. ముందుగా కేఎంసీలో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్తో మాట్లాడి ప్రీతి విద్యాభ్యాసం వివరాలు తెలుసుకున్నా రు. సిట్టింగ్ జడ్జ్ ఆధ్వర్యంలో నిపుణులైన వై ద్య బృందం ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్చందర్ పాల్గొన్నారు.