హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : వ్యాపార సమస్యలకు డాటా ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్.. బిజినెస్ అనలిటిక్స్ ల్యాబ్ను ప్రారంభించింది. మంగళవారం హైదరాబాద్ కొండాపూర్లోని కేఎల్ యూనివర్సిటీలో ఈ ల్యాబ్ను ఏర్పాటుచేశారు.
కార్యక్రమంలో సిగ్నిటీ డిజిటల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ అధ్యక్షుడు కిరణ్ కూసుమంచి, సీఎంవో శ్రీరామ్ వేదం, టైమ్స్ ప్రో అకడమిక్ కంటెం ట్ డాక్టర్ నాగేంద్ర వీ చౌదరి, కేఎల్హెచ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.