హైదరాబాద్: ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి సాగరాన్ని చేరనున్నాడు. పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్రకు సంబంధించిన పనులు పూర్తికావస్తున్నాయి. ఇప్పటికే క్రేన్ సాయంతో ట్రాలీపై కొలువుతీరాడు. ప్రస్తుతం ట్రాలీపై వెల్డింగ్ పనులు సాగుతున్నాయి. అవి ముగిసిన వెంటనే గణేశుడి శోభాయత్ర ప్రారంభం కానుంది.
40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర ఖైరాతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్బండ్పైకి సాగనుంది. మొత్తం 2.5 కిలోమీటర్లు సాగుతుంది. ట్యాంక్ బండ్పై 4వ నంబర్ క్రేన్ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. కొవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ ఖైరతాబాద్ గణనాథుడిని సాగనంపేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేశారు.