హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4: పట్టణ, మారుమూల ప్రాంతాల యువతకు ఉపయోగపడేలా టీ హబ్లోని కీబూర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ శిక్షణ ద్వారా నైఫుణ్యాన్ని పెంపొందించడానికి, మార్కెట్ ట్రెండ్లపై అవగాహన, ఉద్యోగావకాశాల కల్పనకు ఈ వేదిక తోడ్పాటు అందించనున్నది. కీబూర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్రంజన్, టీ హబ్ సీఈవో ఎంఎస్రావు శుక్రవారం ఆవిష్కరించారు.టెక్నాలజీ సహకారంతో వినూత్న ఆవిష్కరణలు చేసే యువతకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని జయేశ్రంజన్ చెప్పారు. కార్పొరేట్ కంపెనీలు, విద్యాసంస్థలతో కలిసి కెరీర్కు సంబంధించిన అంశాలే ప్రాతిపదికగా కీబూర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటుందని ఆ స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాన్సన్ ముప్పసాని తెలిపారు. సమావేశంలో వ్యవస్థాపకుడు ఆనంద్ బూమ్పోగ్, మోజెస్ పాల్ ముప్పసాని పాల్గొన్నారు.