కంది, సెప్టెంబర్ 18: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్ష-21 (డీఈఈ సెట్లో) సంగారెడ్డి జిల్లా కంది మండ లం ఆరుట్ల గ్రామానికి కుమ్మరి కావ్య రాష్ట్రస్థాయి 2వ ర్యాంకు సాధించారు. కుమ్మరి వెంకటేశం మాధవి దంపతులకు కూతురు, ఇద్దరు కొడుకులు. కావ్య టెన్త్ 9.5 శాతం జీపీఏ సాధించింది. సంగారెడ్డిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ)లో 968 మార్కులతో ప్రతిభ కనబర్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కావ్య రాష్ట్రస్థాయిలో రెండోర్యాంకు సాధించడంపై గ్రామస్తులతోపాటు అధ్యాపకులు అభినందించారు.