హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) అధ్యక్షురాలిగా కవితా రాజేశ్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 57 ఏండ్ల చరిత్ర ఉన్న హెచ్ఎంఏకు కవిత మూడో మహిళా అధ్యక్షురాలు. కవితా రాజేశ్ రాకతో తమ హైదరాబాద్ ఆఫీస్ పూర్తిగా మహిళా సిబ్బంది ఉన్న కార్యాలయంగా మారిందని హెచ్ఎంఏ పేర్కొన్నది.