ఫర్టిలైజర్సిటీ, జనవరి 8: ప్రతిష్ఠాత్మక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐకార్) జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో గోదావరిఖని బిడ్డ సత్తా చాటింది. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ వర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో 269 ర్యాంకు సాధించింది. వర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ సీటు దక్కించుకొని, అందరిచేత ప్రశంసంలు అందుకొన్నది. ఆమే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని విద్యానగర్కు చెందిన సలిగంటి సదానందం, రజిత కూతురు కావేరి. చిన్నతనం నుంచి కావేరీ చదువులో చక్కగా రాణిస్తున్నది. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గురుకులంలో పదోతరగతిలో 10 జీపీఏ కైవసం చేసుకొన్నది, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గురుకుల కాలేజీలో 97శాతం మార్కులతో ఇంటర్ బైపీసీలో ఉత్తీర్ణత సాధించింది. దీంతో ఆమెను కాలనీవాసులు, తోటి విద్యార్థులు అభినందించారు.