హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రతి పట్టు వైరటీలో భారతీయ సంప్రదాయాలకు పట్టం కట్టే కాంచీపురం మంగళగౌరీ సంస్థ జంట నగరాల్లోని అమీర్పేట, షాపూర్నగర్, కొత్తపేట, ఏఎస్ రావునగర్లలోని తమ షోరూమ్స్లోని శ్రావణ మాసం శుభ సందర్భంగా వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. వీటిలో ప్రధానంగా శ్రావణం వేడుకలు కేజీ సేల్, అని నరకాల వస్ర్తాలపై 50 శాతం తగ్గింపు వస్త్ర ప్రియుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
కంచి, ధర్మవరం, ఉప్పాడ, పోచంపల్లి, ఆరని, గద్వాల్ వేంకటగిరి, బెనారస్, జైపూర్, కేరళ నుంచి కాంచీపురం మంగళ గౌరి తన కస్టమర్ల అభిరుచులను, అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే వేడుకలను దృష్టిలో ఉంచుకొని అత్యంత ప్రత్యేకంగా తయారు చేయించిన పట్టు చీరెలు సంప్రదాయ ప్రియుల అభిమానాన్ని చూరగొంటున్నాయి. నిజ శ్రావణ మాసంలో ఈ ఆషాఢమాసం ధరలకే వీటిని విక్రయించడంతో కాంచీపురం మంగళ గౌరి షోరూమ్స్ను పట్టు వస్ర్తాభిమానులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు.