సంగారెడ్డి : కంది మండలం మామిడిపల్లి గ్రామంలో కనకదుర్గ అమ్మవారి లడ్డూను ముస్లిం వ్యక్తి దక్కించుకున్నాడు. గ్రామంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహన్ని హిందువులు ప్రతిష్టించారు. నవరాత్రుల చివరి రోజు అమ్మవారి విగ్రహం నిమజ్జనం కంటే ముందు.. లడ్డూను వేలం వేశారు. ఈ వేలం పాటలో హిందువులతో పాటు ముస్లిం యువకుడు మహ్మద్ ఫరీద్(31) పాల్గొన్నాడు.
గ్రామ రెవెన్యూ సహాయ అధికారిగా పని చేస్తున్న ఫరీద్.. ఈ వేలం పాటలో రూ. 55 వేలకు లడ్డూను దక్కించుకున్నాడు. ఆ లడ్డూను గ్రామ ప్రజంలదరికీ పంచిపెడుతానని ఫరీద్ చెప్పాడు. వినాయక చవితి, దసరా పండుగలను తన స్నేహితులతో కలిసి జరుపుకున్నానని ఫరీద్ పేర్కొన్నాడు.