కాకతీయ కళాతోరణాలు కేవలం అలంకారం కోసం చేసిన ఆకృతులు కానే కావు. ఆ తోరణాల్లో ఆనాటి కాకతీయ రాజుల పాలనా వైభవమంతా పూస గుచ్చినట్టుగా ఉంటుంది. నాడు ప్రజల సుభిక్ష పాలనకు అద్దంపడుతున్నాయి. అపార జలరాశి పరవళ్లు తొక్కడంతో పండిన అపార పంటలకు ఆనవాళ్లుగా, ఆనాటి ఆర్థిక పురోగతికి సంకేతాలుగా నిలిచాయి. కాకతీయ రాజుల ఎదురులేని కీర్తి పతాకాలుగా, గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబాలుగా ముందు తరాలకు చరిత్రను అందిస్తున్నాయి.
(పిన్నింటి గోపాల్), వరంగల్, మే 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగించిన కాకతీయులు అనగానే మొదట గుర్తుకు వచ్చేది కాకతీయ కీర్తి తోరణాలు. కాకతీయ కళాతోరణం, స్వాగత తోరణం, ద్వారతోరణం, స్వాగత తోరణం, విజయ తోరణం, శిలాతోరణ ద్వారం… ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా కాకతీయ తోరణాలు ఆనాటి శిల్పుల గొప్ప కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఇప్పటికీ నిలిచి ఉండటం విశేషం.
భారతీయ ఆలయాల నిర్మాణ వాస్తు సంప్రదాయంలో తోరణాల నిర్మాణం క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలోనే మొదలైంది. తోరణాల నిర్మాణ పద్ధతికి ఆద్యుడిగా శాతవాహన రాజైన శ్రీశాతకర్ణిని పేరొనవచ్చు. ఆయన సాంచీ స్తూపం చుట్టూ నాలుగు దికుల్లో నాలుగు తోరణ ద్వారాలను నిర్మించాడు. ప్రస్తుతం హిందూ ఆలయాలకు మనం చూస్తున్న తోరణ ద్వారాల నిర్మాణ సంప్రదాయం బౌద్ధస్తూపాల తోరణాల ద్వారా వచ్చింది. కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండలోని పద్మాక్షి గుట్ట వద్ద ఏర్పాటుచేసిన మొదటి దశ తోరణంగా చరిత్రకారులు తెలిపారు.
దీనిని 1,117వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్తారు. ఐనవోలు, కొలనుపాకల్లో ఏర్పాటుచేసిన రెండో దశ తోరణంలో లేని ప్రత్యేకతలు వరంగల్ కోటలోని తోరణాల్లో మనకు కనిపిస్తాయి. అనంతరం కాకతీయుల రాజధాని ఓరుగల్లు(ఖిలా వరంగల్)కు మారింది. అక్కడ ప్రతిష్ఠించిన కీర్తి తోరణాలు మరింత కళావైభవంతో కనిపిస్తాయి. హంసలు, మొసళ్లు కాకతీయ తోరణాల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. కాకతీయ కాలపు శిల్పులు.
తెలుగు ప్రజల కళాదృష్టికి, అభిరుచికి, కాకతీయుల కాలపు శిల్పుల కళా ఔన్నత్యానికి నిదర్శనాలుగానూ, అందులో వారి ప్రతిభను చాటి చెప్పే కీర్తి తోరణాలుగానూ ఆ శిలా తోరణాలు ఇప్పటికీ నిలిచి ఉండటం విశేషం. వరంగల్ కోటలో నాలుగు కాకతీయ తోరణాలు సమానదూరాలలో విస్తరించి దర్శనమిస్తాయి. చూసేందుకు ఓ అలంకారపు ద్వారంలా కనిపించినా అందులో తెలుసుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి.
కళాతోరణాల ప్రత్యేకత
కాకతీయుల పాలనా వైభవమంతా ఈ కళాతోరణాల్లో పూస గుచ్చినట్టుగా ఉంటుంది. వారి ఏలుబడిలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారో మనకు తెలుస్తుంది. హంసలు, మొసళ్లు కాకతీయ తోరణంలో ప్రముఖంగా కనిపిస్తాయి. పద్మాలు, మొకలు, తలకిందులుగా వేలాడినట్టుండే తామెర మొగ్గల వంటి ఆకృతులు ఇలా ఎన్నో అంశాల కలబోత వరంగల్ కాకతీయ తోరణాలు. నాలుగు పిల్లర్లు వారి పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందనడానికి నిదర్శనంగా మనకు కనిపిస్తుంది.
చివరి రెండు పిల్లర్ల మీద ఇరుపకలా గర్జించిన సింహాలు కాకతీయుల ఎదురులేని నాయకత్వానికి చిహ్నం. దానిపకన తల పైకెత్తిన మొసలి జలకళకు ప్రతీతి. కాకతీయుల కాలంలో చెరువులు, కుంటలు, కాలువల్లో పుషలంగా నీళ్లుండేవి. నీళ్లు ఎకడైతే ఉంటా యో అకడ మొసళ్లు ఉంటాయి. తోరణం నిండా లతలు, తీగలు పారే గొలుసుకట్టు చెరువులను, కుంటలనూ సూచిస్తాయి. అపార జలరాశి పరవళ్లు తొకడంతో ఆ కాలంలో పంటలు బాగా పండేవి.
కాకతీయుల కాలంలో ప్రజలకు ఆకలిబాధ ఎలా ఉంటుందో తెలియదంటే అతిశయోక్తి కాదు. పైన ఇరువైపులా రెండు హంసలు కాకతీయుల పారదర్శక పాలనకు నిదర్శనం. చేతులు పైకెత్తిన కుబేరుల విగ్రహాలు ఆర్థిక పరిపుష్ఠికి సంకేతం. మొసలి కింది భాగంలో వజ్ర వైఢూర్యాల దండలు కాకతీయుల వైభవానికి చిహ్నం. ఆర్థిక పురోగతి అద్భుతంగా ఉండేదని సంకేతం. ఏడు పూర్ణకుంభాలు గ్రామదేవతల ప్రతిబింబాలు. వాటి నే సప్తమాతృకలు అని కూడా పిలుస్తారు. స్తంభం మధ్యభాగంలో చేపల బొమ్మలు ఓ వెలుగు వెలిగిన మత్స్య పరిశ్రమకు సంకేతం.
హనుమకొండలో మట్టికోట నిర్మాణం
కాకతీయ రెండో ప్రోలరాజు కాలంలో తొలి రాజధాని అయిన అనుమకొండలో కోట నిర్మాణం జరిగింది. సిద్ధులగుట్ట, అగ్గలయ్యగుట్ట, భద్రకాళి గుట్టలను కలుపుతూ మట్టికోట నిర్మాణం చేశారు. ఈ మూడు కొండలపై కోట గోడలను నిర్మించారు. ఆ గోడల శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షి ఆలయానికి వెళ్లే దారిలో అగ్గలయ్య గుట్ట పకన రోడ్డు మీద ఒక రాతిద్వారం ఉంది.
ఇదే హనుమకొండ కోట ప్రవేశద్వారం. ఎలాంటి అలంకారాలు లేకుండా 20 అడుగుల ఎత్తున కేవలం రెండు నిలువు స్తంభాలు, వాటిపై ఒక అడ్డ దూలం ఉంది. ద్వారానికి కోట తలుపులు పెట్టిన ఆనవాళ్లేమీ లేవు. సిద్ధేశ్వర ఆలయ సమీపంలో ఉన్న సిద్ధులగుట్ట పకన మరో రెండు రాతిద్వారాలు ఉన్నాయి. ఇంకొక రాతిద్వారం పూర్తిగా ధ్వంసమై ప్రస్తుతం ఒకే స్తంభం మిగిలి ఉన్నది. ఈ రాతిద్వారాలు కాకతీయ కీర్తితోరణ ద్వారాల కన్నా ఎంతో ప్రాచీనమైనవి.
వరంగల్ ద్వార తోరణాల ప్రత్యేకత
వరంగల్లోని కాకతీయుల కోట శిథిలాలకు నలువైపులా నిలిచి ఉన్న నాలుగు ద్వార తోరణాలను ‘తోరణ ద్వారాలని, హంస ద్వారాలని, కీర్తి తోరణాలని’ చరిత్రకారులు పేర్కొన్నారు. వరంగల్ కోట మధ్యభాగంలో నాలు గు తోరణ ద్వారాలు నిర్మించబడ్డాయి. ప్రతిద్వారానికి నాలుగు స్తంభాలు, రెండువైపులా రెండేసి స్తంభాలు ఉన్నాయి. పెద్ద రాతిదూలానికి కిందివైపు ఏడు తామెర మొగ్గలు ఉన్నాయి. దూలానికి రెండు చివరలా పైవైపు రెండు హంసలు నిలబెట్టి ఉన్నాయి. రాతి దూలాన్ని, స్తంభాలను కలుపుతూ రెండువైపులా నాసికలు (బ్రాకెట్లు)గా సింహశిల్పాలు అమర్చి ఉన్నాయి. రాతిదూలం మీద అమర్చి న శిలాఫలకాల మీద అద్భుత శిల్పకల మనకు కనిస్తుంది. తూర్పు ద్వారంపై (ధన) లక్ష్మి, పడుమటి ద్వారంపై గణపతి, ఉత్తర ద్వారంపై సూర్య విగ్రహ శిల్పాలు ఉన్నాయి.
కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ
కాకతీయ కళా తోరణద్వారాల కంటే ముందు కూడా తోరణ ద్వారాలున్న ఆలయాలు ఉన్నాయి. ఈ తోరణ ద్వారాలు ఆలయాలకు మాత్రమే కాకుండా నగర ద్వారాలుగానూ ఉన్నాయి. కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండ ద్వారాలు ఎలాంటి అలంకారాలు లేకుండా ఉన్నాయి. హనుమకొండ చౌరస్తా నుంచి పద్మాక్షి ఆలయానికి వెళ్లే దారిలో ఒక తోరణం, సిద్ధులగుట్ట వెనుక భాగంలో మరో రెండు ద్వారాలు ఉన్నాయి.
కాకతీయ తోరణ ద్వారాలను పోలిన ద్వారాలు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి నలువైపులా ఉన్నాయి. ఇవికాకుండా మెదక్ జిల్లాలోని నందికంది, వెల్దుర్తి, యాదాద్రి-భువనగిరి జిల్లా కొలనుపాక, పెద్దపల్లి జిల్లా ఆబాది రామగుండంలోని శివాలయం ముందు కూడా తోరణ ద్వారాలు ఉన్నాయి. రామగుండం, నందికంది, వెల్దుర్తి, కొలనుపాకలో ద్వారం ఉత్తరాశి (లెంటిల్)మీద ఇరువైపులా రెండు రకాల శిల్పాలున్న శిలలను అమర్చారు. ద్వారస్తంభాలు ఉత్తరాశి కలిసేచోట సింహశిల్పాలను బ్రాకెట్లుగా వాడారు.
యుద్ధానికి సూచిక గొడిశాల తోరణం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వద్ద సైదాపురం మండలంలో గొడిశాల గ్రామం ఉన్నది. ఢిల్లీ సుల్తానులకు, కాకతీయులకు ఇక్కడే యుద్ధం జరిగింది. ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ 1303లో మాలిక్ ఫక్రుద్దీన్, జునాఖాన్ నాయకత్వంతో పంపిన సేనలను కాకతీయ సేనానులైన పోతుగంటి మైలి, రేచర్ల వెన్నభూపాలుడి నాయకత్వంలో కాకతీయ సైనికులు వీరోచితంగా పోరాడి దండయాత్రను తిప్పికొట్టారు. అప్పుడే ఆ గ్రామ సమీపంలో ఒక తోరణాన్ని నిర్మించారని చరిత్రకారులు చెప్తారు.
తెలంగాణలో తోరణద్వారాలు
1. కొలనుపాకలో సోమేశ్వర ఆలయ ద్వారం, బయట రాజద్వారం-2
2. నందికందిలో గుడివద్ద-1
3. వెల్దుర్తిలో దారిమీద-1
4. రామగుండం ఆలయం ముందర-1
5. గొడిశాల గుడి బయట-1
6. ఒల్లాల కేశవాలయ శిథిలాల వద్ద-1
7. డిచ్పల్లి గుడిమెట్ల ముందర-1
8. ఇంద్రేశం శివాలయం ముందర-2
9. మల్లికుదుర్లలో-1
10. ఐనవోలు-4
11. హనుమకొండ-4
12. వరంగల్లు-4 (ప్రతాపగిరి కోట ప్రవేశద్వారం, గజలక్ష్మి లలాటబింబం)