హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): యూకే వీసాలు పొందే ప్రక్రియ సజావుగా సాగి, సత్వరమే మంజూరు చేసేందుకు బ్రిటిష్ హైకమిషన్.. కగూల్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నది.
బుధవారం హైదరాబాద్లోని కగూల్ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఒవెన్, కగూల్ ఎండీ కళ్యాణ్గుప్తా ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. కగూల్ సీఈవో డాన్బార్లో, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రశాంత్ పటేల్ పాల్గొన్నారు.