Kadiam Kavya | కాంగ్రెస్ పార్టీ సోమవారం రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మహారాష్ట్రలోని అకోల స్థానం నుంచి డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్, తెలంగాణలోని వరంగల్ లోక్సభాస్థానం నుంచి కడియం కావ్య పేర్లు ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంతకుముందు తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నుంచి తొలుత వరంగల్ స్థానానికి కడియం కావ్య అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసింది. అయితే, అవినీతి ఆరోపణలు, పార్టీలో సమన్వయ లోపం ఉందని, పార్టీ శ్రేణుల నుంచి తనకు సహకారం అందడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేయలేనని కడియం కావ్య ప్రకటించారు.
తదుపరి తన తండ్రి, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు రోజుల్లోనే వరంగల్ లోక్ సభ స్థానం అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఏఐసీసీ ఖరారు చేసింది.