హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : కుల వివక్ష, మతోన్మా దం, వెర్రితలలు వేస్తున్నాయని, వీటిని ఎదుర్కోవాలంటే దిగంబర కవి జ్వా లాముఖి వంటి ప్రభంజనం రావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. జ్వా లాముఖి జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఆయన సంస్మరణ సభ నిర్వహించా రు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్ బాలాచారి, కటుకోఝ్వల ఆనందాచారి, రాపోలు సుదర్శన్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, వాహెద్, మెహనకృష్ణ, రామారావు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.