హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఎంతోమంది న్యాయకోవిదులను, దే శం గర్వించే న్యాయ ప్రముఖులను తెలంగాణ హైకోర్టు అందించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టి చెప్పారు. ఆ వారసత్వాన్ని నేటి తరం కొనసాగించాలని అన్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా చేసి పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన సందర్భంగా ఆయనను తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం ఘనంగా సతరించింది. బార్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, తన అన్న న్యాయవాదిగా నమోదు అయినప్పుడు ఇదే హైకోర్టుకు చిన్నతనంలో వచ్చానని తెలిపారు. చారిత్రక భవనం ఎంతగానో ఆకట్టుకున్నదని అన్నారు.
తనకు ఈ హైకోర్టుతో 30 ఏండ్ల అనుబంధం ఉన్నదని చెప్పారు. ఇకడ ఎందరో సహకరించారని, తాను ఈ స్థాయికి చేరడానికి వారి సహకారం మరువలేనని చెప్పారు. ఇదే హైకోర్టులో ప్రభుత్వరంగ సంస్థలకు న్యాయవాదిగా, కాలుష్య నియంత్రణ మండలి స్టాండింగ్ కౌన్సిల్గా చేశానని తెలిపారు. తనకు గుర్తింపు కూడా ఇకడే లభించిందని, హైకోర్టు న్యాయమూర్తి కావడానికి దోహదపడిందని చెప్పారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఇతర న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి , పీపీ రాజేందర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ చెంగల్వ కళ్యాణ్రావు, ఇతరులు నాగులూరి కృష్ణకుమార్ గౌడ్, ప్రదీప్, దేవేందర్ పాల్గొన్నారు. తొలుత జస్టిస్ అలోక్ అరాధే తన చాంబర్లో జస్టిస్ భట్టిని సతరించారు.