హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల అక్రెడిటేషన్ (202224) దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో15 లోపు, జిల్లా స్థాయిలో 20 వరకు https:ipr. telangana. gov. inలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ముందుగా 10న తుది గడువు ఉండగా, దానిని పెంచుతున్నట్టు పేర్కొన్నారు.