JNTU | హైదరాబాద్ : జేఎన్టీయూలో ఫుల్ టైమ్, పార్ట్టైమ్ పీహెచ్డీలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి ఈ నెలలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, అయితే గ్రూప్-2 పరీక్షలు కూడా ఇదే నెలలో జరుగుతున్న నేపథ్యంలో పీహెచ్డీ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పార్ట్టైమ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.