హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించినట్టు సమాచారం. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఓబెదుల్లా కోత్వాల్, ఉర్దూ అకాడమీ చైర్మన్గా తాహెర్ బిన్ హందాన్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా దీపక్ జాన్ను నియమించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.