హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జనహర్షం ప్రేమ్ సిటీ-2లో హిడింబి ఇసుర్రాళ్లు అని ప్రచారం జరుగుతున్న వాటిని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆదివారం పరిశీలించారు. అవి సహజ సిద్ధంగా ఏర్పడిన రాళ్లేనని స్పష్టం చేశారు. మహాభారతంలో హిడింబాసుర సోదరి, భీముని భార్య హిడింబి వాడిన ఇసుర్రాళ్లు అనే ప్రచారంలో నిజం లేదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక యువకుల ఆహ్వానం మేరకు ఆ రాళ్లను పరిశీలించినట్టు ఆయన పేర్కొన్నారు.