హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాహుల్గాంధీ మాటకు విలువ లేకుండా పోయిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థా నం కమిటీతోపాటు, నామినేటెడ్ పోస్టు ల్లో సామాజిక న్యాయం పాటించకపోవడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. శనివారం ఒక ప్రకట న విడుదల చేశారు. యాదగిరిగుట్ట కమిటీలో చైర్మన్తో సహా 60 శాతం పదవులను అగ్రకులాలకే కట్టబెట్టారని, బీసీలకు రెండు మెంబర్లతోనే సరిపెట్టారని, నిప్పులు చెరిగారు. నామినేటెడ్ పోస్టులు, ప్రభు త్వ పోస్టింగులు ఒకే సామాజికవర్గానికి కేటాయిస్తూ, బీసీలను ని ర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.
కులగణన తర్వాత ఎవరి వాటా వారికి దక్కాలన్న రాహుల్ మాటలకు, రాష్ట్రంలో ప్రభుత్వం అమ లు చేస్తున్న విధానాలకు పొంతనే లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎస్ నుంచి డీజీపీ వరకు, కలెక్టర్ల నుంచి ఎస్పీల వరకు అగ్రకులాలకే అన్ని పదవులను కట్టబెడుతూ బీసీలను అణచివేస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.