హైదరాబాద్, జూన్26 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ ఈఎన్సీ శంకర్కు ఇరిగేషన్శాఖ ఈఎన్సీ అడ్మిన్గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎన్సీ అడ్మిన్గా అమ్జద్ హుస్సేన్ ఉండగా, ఆయనను ఇటీవల ఈఎన్సీ జనరల్గా ప్రభుత్వం నియమించింది. దీంతో శంకర్కు అడ్మిన్గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్గా సెక్రటేరియట్లో ఇరిగేషన్శాఖ టెక్నికల్ ఎస్ఈ సాజిద్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. సెక్రటేరియట్ టెక్నికల్ విభాగం డీఈఈ మహేశ్వర్రెడ్డికి ఈఈగా, డీడీఎంగా అక్కడే అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం బెట్టెతండా వద్ద మూసీ నదిపై చెక్డ్యామ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.10.23కోట్లతో అనుమతులు మంజూరు చేసింది.