హైదరాబాద్ : రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీసు కమిషనర్గా ఏవీ రంగనాథ్ను నియమించింది. తరుణ్ జోషిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.