హైదరాబాద్, ఆగస్టు9 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్-2024 (పీఎంఆర్బీపీ)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నది. శౌర్యం, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సాంస్కృతిక, ఆవిష్కరణల్లో జాతీయస్థాయి గుర్తింపు పొంది, 18 ఏండ్లు మించని బాలలు అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, లేదంటే ఎవరైనా వారిని నామినేట్ చేయవచ్చని వెల్లడించింది. దరఖాస్తులకు 31 గడువని, వివరాలకు awards.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.