హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల 7 వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, గురుకులాలు, మాడల్ స్కూల్స్కు ఇలా అన్ని రకాల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ గడువు వర్తిస్తుందని బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, వివరాలకు https://acadtgbie.cgg.gov.in/ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.