హైదరాబాద్, మే19 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 6,7,8 తరగతుల్లో ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారు జూన్ 2 లోగా ఆన్లైన్లో http://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు 040-23322377, 23328266 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.