హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీన ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 9:30 గంటలకు ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్లో 63.32 శాతం.. సెకండియర్లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా.. ఫస్టియర్లో 2,94,378 మంది, సెకండియర్లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు.