హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సుమారు 12 వేల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఎఫ్టీఈ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరనున్నది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందం ప్రకారం, ప్రతి ఉద్యోగికీ వారి వేతనం ఆధారంగా రూ.40 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ బీమా ప్రధాన విశేషం ఏమిటంటే, దీని కోసం ఉద్యోగి కానీ లేదా ప్రభు త్వం కానీ ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ పథకం, స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ పథకం కింద ప్రయోజనం అందిస్తుంది.