హైదరాబాద్ : హైదరాబాద్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో ఎనిమిదవ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటో ఫెస్టివల్-2022 ను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ ఫోటో ఫెస్టివర్ నేడు, రేపు కొనసాగనుంది. ఈ ఫోటోగ్రఫీ ఫెస్టివల్లో 40 దేశాల నుంచి 350 మందికి పైగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఫోటోగ్రాఫర్లు తీసిన 1500 ఫోటోలను ప్రదర్శనలో ఉంచారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ గాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డా. లక్ష్మీ, నిర్వాహకులు అక్విన్ మాథ్యూస్, మున్సిపల్ శాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ వందన్ కుమార్, హాకీ అసోసియేషన్ చైర్మన్ కొండ విజయ్ తదితరులు పాల్గొన్నారు.